మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

14, అక్టోబర్ 2012, ఆదివారం

నీవనుచు నీవైతినే




పూజ 
పూజామందిరంలో వుండదు
ఇక్కడుంటుంది..
గుండెల్లో
ప్రతి పాపం చేసే టప్పుడు 
ఇక్కడనడుస్తుంది శరణాగతి..
తత్వం తెలిస్తే..

అయిదు జ్ఞానేంద్రియములు
అయిదు కర్మేంద్రియములు
సుఖాన్నివ్వటానికి
దుఃఖాన్నివ్వటానికి
వానికి స్వాతంత్రమేంవుండదు

మనసు రౌతు 
మనసు రహస్యాన్ని ఒకసారి ఆలోచిస్తే 
చిత్రంగా వుంటుంది

దీనికెప్పుడూ సుఖం కావాలి
కన్నుద్వారా
ముక్కు ద్వారా
నాలుకద్వారా
చెవి ద్వారా
స్పర్శద్వారా..
ఇదీ మనసు  ఆట..

మనసు మాట వింటూ వుంటే
సుఖాలు సుఖాలు సుఖాలు
ఇంతే..
ఎందుకాబ్రదుకు..?

ఆ మనసుకు  
తనలోవున్న 
మరో తన ను చూపించే ప్రయత్నం చేయాలి
ఆ తన ను అది మైమరచి పట్టేలా చేయాలి
ముందది వినదు
మొరాయిస్తుంది
నాలుగు రోజులు అలవాటుచేస్తే
పద నామం చెబుదామంటుంది.

అలా..
అలా..
మనసు మననం చేసి చేసి
తనలో వున్న మరో తననే 
చూడడం ప్రారంభిస్తుంది

చూసి చూసి
తనే ఆ లోపలి రూపం తానే అవుతుంది
ఇంద్రియాలేమయ్యాయి..?
మనస్సులోకెళ్ళిపోయాయి..

మనస్సేమయింది ..?
ఈశ్వరుని పాదాల వద్ద నిలబడిపోయింది

బాహ్య పూజ.. అంతః పూజకోసం


ఇదే 
"భ్రమరమ్ము నిరతమ్ము భావించి కీటకము
తానె భ్రమరమ్ముగా తనువు మారటం.."


ఈ పాటలు పాడి పాడి
మా కీటక హృదయాలు 
భ్రమరంగా మారలేదెందుకని ప్రభూ ..?






రచన      : శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు    
పాడినది : పుట్టపర్తి తరులత 


నీవనుచు నీవైతినే
పరమాత్మ
నిను జూచి నీవైతినే

భ్రమరమ్ము నిరతమ్ము భావించి కీటకము
తానె భ్రమరమ్ముగా తనువు మారినయట్లు

నీవనుచు నీవైతినే  పరమాత్మ
నిను జూచి నీవైతినే


ప్రేమ మయజపమాలలో మధురమైన నీ
నామమ్ము సతతమ్ము నీమమున జపియించి


సర్వ సుందర రూప సాకృతి నిరాకార
అనుభవపు ముకురమ్ము నందున్న నా నీడ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి