కృష్ణావతారంలో ..
నందప్రజలలో ..
గోపకాంతలతో ..
గోపాలురతో ..
గోవులతో ..
కృష్ణుడు మమేకమైపోయాడు
ఇలా ..
ఏ అవతారంలో కూడా
భగవానుడు కలిసి పోయింది లేదు
భగవద్గీత బోధించిన వాడు
జగద్గురువైనటువంటి వాడు
సంకల్ప మాత్రంచేత
రాక్షసులను సం హరించగల వాడు
అటువంటి పరమాత్మ
ఏమీ తెలియని గోపాలకులతో కలిసిపోయినట్లు ఇంకెక్కడా కనపడడు
కృష్ణ ప్రేమను మీరెంతగా ఆలోచిస్తారో
అంత కృష్ణునికి దగ్గరవుతారు.
ఎంత కృష్ణునికి దగ్గరవుతారో
అదే మనకు శ్రీరామ రక్ష
అందుకే
మునులు సంసారాలు వదిలేసి
ప్రపంచాన్ని వదిలి
కొన్ని వేల సంవత్సరాలు
తపస్సు చేసినా చిక్కని పరమాత్మను
యశోద రోటికి కట్టివేసింది
గోపకాంతలు
వెన్న దొంగపై చాడీలు చెప్పడానికి
తయారుగా వుండేవాళ్ళు ఎప్పుడూ
అందుకే పుట్టపర్తి వారు
"చిక్కితివి లేర నాచేత గోపాల.."
అని వ్రాసారు
లీలా శుకుడు
కృష్ణ లీలలను ఎన్ని అనుభవించారో
అంతగానూ తనివారా అనుభవించారు
పుట్టపర్తి వారు
ఈ కీర్తన వినండి..
రచన శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు
గానం ధర్మరాజు వంశీప్రియ
చిక్కితి వి లేరా నా చేత గోపాల
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..
చిక్కని వెన్నల మెక్కి గోపికలిండ్ల
దక్కకయె కనుబ్రాము దళితేంద్ర నీలా ..
చిక్కితి వి లేరా నా చేత గోపాల
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..
ఆ యశోదకు నోట అఖిల జగములుజూపి
మాయగొలిపిన విభ్రమాచారశీలా..
చిక్కితి వి లేరా నా చేత గోపాల
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..
అష్టాక్షరీ మంత్ర మమర నా ప్రాణమై
ఆ మంత్రమే నీకు హాటకపు బీఠమై..
చిక్కితి వి లేరా నా చేత గోపాల
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి