మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

7, అక్టోబర్ 2012, ఆదివారం

"చిక్కితివి లేర నాచేత గోపాల.."




కృష్ణావతారంలో ..
నందప్రజలలో ..
గోపకాంతలతో ..
గోపాలురతో ..
గోవులతో ..
కృష్ణుడు మమేకమైపోయాడు

ఇలా ..

ఏ అవతారంలో కూడా 
భగవానుడు కలిసి పోయింది లేదు

భగవద్గీత బోధించిన వాడు

జగద్గురువైనటువంటి వాడు 
సంకల్ప మాత్రంచేత 
రాక్షసులను సం హరించగల వాడు

అటువంటి పరమాత్మ 

ఏమీ తెలియని గోపాలకులతో కలిసిపోయినట్లు ఇంకెక్కడా కనపడడు

కృష్ణ ప్రేమను మీరెంతగా ఆలోచిస్తారో 

అంత కృష్ణునికి దగ్గరవుతారు.
ఎంత కృష్ణునికి దగ్గరవుతారో 
అదే మనకు శ్రీరామ రక్ష 

అందుకే 

మునులు సంసారాలు వదిలేసి 
ప్రపంచాన్ని వదిలి 
కొన్ని వేల సంవత్సరాలు 
తపస్సు చేసినా చిక్కని పరమాత్మను
యశోద రోటికి కట్టివేసింది
గోపకాంతలు 
వెన్న దొంగపై చాడీలు చెప్పడానికి 
తయారుగా వుండేవాళ్ళు ఎప్పుడూ

అందుకే పుట్టపర్తి వారు 

"చిక్కితివి లేర నాచేత గోపాల.."
అని వ్రాసారు
లీలా శుకుడు 
కృష్ణ లీలలను ఎన్ని అనుభవించారో 
అంతగానూ తనివారా అనుభవించారు 
పుట్టపర్తి వారు
ఈ కీర్తన వినండి..






రచన    శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు
గానం    ధర్మరాజు వంశీప్రియ 



చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..

చిక్కని వెన్నల మె
క్కి గోపికలిండ్ల 
దక్కకయె కనుబ్రాము దళితేంద్ర నీలా ..


చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..

ఆ యశోదకు నోట అఖిల జగములుజూపి
మాయగొలిపిన విభ్రమాచారశీలా..

చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..



అష్టాక్షరీ మంత్ర మమర నా ప్రాణమై

ఆ మంత్రమే నీకు హాటకపు బీఠమై..

చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి